రెండో ఇన్నింగ్స్ లో భారత్ 36/9

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లోభారత్ 31 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి టెస్టు చరిత్రలో అతి తక్కువ స్కోరు నమోదు చేసింది. శనివారం మూడో రోజు ఆట మొదలైన రెండో ఓవర్ నుంచే వికెట్ల వేట మొదలెట్టిన ఆసీస్ బౌలర్లు గంటన్నరలో భారత బ్యాట్స్మెన్ను కుప్పకూల్చారు. హాజిల్వుడ్ 5/8, కమిన్స్ 4/21 నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడడంతో భారత బ్యాటింగ్ లైనప్ పేక మేడలా కూలింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ నమోదు చేయలేదంటే కోహ్లీసేన ఎలా ఆడిందో అర్థమవుతుంది. దీంతో రెండో ఇన్నింగ్స్లో భారత్ 21.2 ఓవర్లలో 36/9తో నిలిచింది. చివరికి మహ్మద్ షమి(0) రిటైర్డ్ ఔట్గా వెనుతిరగడంతో భారత ఇన్నింగ్స్కు తెరపడింది. మరోవైపు తొలి ఇన్నింగ్స్లో భారత్కు 53 పరుగుల ఆధిక్యం లభించడంతో ఆస్ట్రేలియా లక్ష్యం 90 పరుగులుగా నమోదైంది. మయాంక్ అగర్వాల్(9), హనుమ విహారి(8) టాప్ స్కోరర్లు.